ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలి : ఎమ్మెల్యే రెడ్యానాయక్

by Disha Web Desk 9 |
ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలి : ఎమ్మెల్యే రెడ్యానాయక్
X

దిశ,నర్సింహులపేట: ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్రజా సేవకున్ని నేను అని, బీఆర్ఎస్ అంటేనే ప్రజలకు భరోసానిచ్చే పార్టీ అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని వాటిని తిప్పి కొట్టాలని కార్యకర్తలు సూచించారు.

రైతన్న శ్రేయస్సు కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా మారిందని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పార్టీ కోసం పనిచేసి పార్టీని మూడోసారి అధికారంలో తెచ్చేందుకు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నవీన్ రావు, జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, యువ నాయకుడు రవిచంద్ర, ఎంపీపీ టేకుల సుశీల యాదగిరిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు తోట సురేష్, సర్పంచుల పోరం అధ్యక్షుడు మెరుగు శంకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed