“కేసీఆర్​ అస్థి పంజారానికి బట్టలు వేసినట్లు ఉంటాడు”

by Disha Web Desk 19 |
“కేసీఆర్​ అస్థి పంజారానికి బట్టలు వేసినట్లు ఉంటాడు”
X

దిశ, తెలంగాణ బ్యూరో: “మా నాయకుడిని పొట్టొడా అని విమర్శిస్తారా..? పికికేస్తామని బెదిరిస్తారా? మీకు ఎంత ధైర్యం? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన విధంగా బుద్ది చెప్పాల్సి ఉంటుంది’ అని మాజీ ఎంపీ అంజన్​కుమార్ యాదవ్ ​ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసానిని ‘దొబ్బోడా’ అని తాము అనలేమా? అంటూ ఫైర్ ​అయ్యారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, అంశాలపై మాట్లాడాలి కానీ.. వ్యక్తులు, కులాలను విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ ​అని అంజన్ ​కుమార్ ​ప్రశ్నించారు. కాంగ్రెస్ ​పార్టీ, లీడర్ల జోలికి వస్తే తలసానికి మర్యాద ఉండదని హెచ్చరించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​ మాట్లాడుతూ..“కేసీఆర్​ అస్థి పంజారానికి బట్టలు వేసినట్లు ఉంటాడు” అని విమర్శించలేమా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులను విమర్శిస్తే ప్రజలకు ఉరుకునే స్థితిలో లేరని మల్లు రవి స్పష్టం చేశారు.



Next Story