- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.! మంత్రి కోమటి రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ప్రజాపాలనలో భాగంగా ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళను తీసుకొచ్చామని ఈ సందర్భంగా అన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సెల్బీసీ సొరంగాన్నిపూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంతేగాక రాష్ట్రాన్ని గోదావరి, కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేస్తుందన్నారు. మాది ప్రజల ప్రభుత్వమని, ఈ ప్రజాపాలనలో భాగంగానే సీతారామ ప్రాజెక్టు ను పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా మూడు లక్షల ఎకరాలకు నీరందుతుందని అన్నారు. తాము ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. తమ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ఈ సందర్బంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
Next Story






