- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ ఎండీ ఆదేశాలతో.. బస్సుల్లో ప్రారంభమైన కండక్టర్ల పలకరింపు
తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమంతో మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. ఎండీ గారి ఆదేశాల మేరకు బస్సుల్లో కండక్టర్ల పలకరింపు కార్యక్రమం ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమంతో మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. ఎండీ గారి ఆదేశాల మేరకు బస్సుల్లో కండక్టర్ల పలకరింపు కార్యక్రమం ప్రారంభమైంది. బండ్లగూడ డిపోలో మొదలైన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి ట్రిప్ ప్రారంభంలో కండక్టర్లు ప్రయాణికులను వినమ్రంగా పలకరించి, బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ విధానం ప్రయాణికులకు సానుకూల అనుభవాన్ని కలిగిస్తూ.. RTC సేవల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంపై ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రయాణికులు RTC ఈ ఆలోచనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పంచుకుంటున్నారు. “ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఇంత స్నేహపూర్వకంగా మారడం సంతోషకరం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం RTC బస్సుల్లో కండక్టర్ల పలకరింపు వీడియోలు వైరల్గా మారాయి. ఈ చిన్న మార్పు ప్రయాణికుల మనసును గెలుచుకోవడమే కాకుండా, RTC ప్రతిష్టను కూడా మరింత పెంచుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






