- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన గతంలోనూ మావోయిస్టులతో చర్చలు జరిపారు.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
నక్సలిజాన్ని(Naxalism) తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నక్సలిజాన్ని(Naxalism) తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని ఆ నేతలు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
వినతి పత్రం అందచేసిన వారిలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్లు ఉన్నారు. ఈ సందర్భంగా శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదని ఆయన అన్నారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని, ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని సీఎం తెలిపారు.






