BREAKING:రూ.2లక్షల రుణమాఫీ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన

by Disha Web Desk 18 |
BREAKING:రూ.2లక్షల రుణమాఫీ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: రూ.2లక్షల రైతు రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి జీవన్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆగష్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశాం అని తెలిపారు. ఆరో గ్యారెంటీ రుణమాఫీ చేపట్టే లోపే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. అదేవిధంగా జీవన్‌ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, కేసీఆర్​పై రేవంత్​ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి బీజేపీ ఎంపీ మోసం చేశారని ఆరోపించారు.

Read More...

మహారాష్ట్రతో మొదలైన చర్చలు..ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై సీఎం కీలక ప్రకటన



Next Story

Most Viewed