- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.. తెలంగాణ ప్రజలకు CM రేవంత్ ఆసక్తికర పిలుపు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (World Environment Day) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎంవో కార్యాలయం ద్వారా ఒక సందేశం విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని తెలిపారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ప్రధానాంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించే ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపునిచ్చారు. సహజ వనరుల సంపదను రాబోయే తరాలకు అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ ధృక్పథమని పేర్కొన్నారు. అదేవిధంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఈ సందర్భంగా ఒక ప్రకటన ఎక్స్ వేదికగా విడుదల చేశారు.
చెట్లను పెంచి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించ్చి.. మన ఆరోగ్యమే కాదు, మన భవిష్యత్ తరాల సంపూర్ణ ఆరోగ్యానికి పునాదులు వేద్దాం.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం.. అని పిలుపునిచ్చారు. కాగా, వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో కొత్తగా చెట్లు నాటే వన మహోత్సవం (Vana Mahotsavam) కార్యక్రమం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున వన మహోత్సవం చేపట్టబోతున్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచటమే లక్ష్యంగా ఇటీవల అధికారులకు మంత్రి కొండా సురేఖ దిశానిర్దేశం చేశారు.






