CM Revanth Reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. జేపీ నడ్డాతో భేటీ

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

CM Revanth Reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. జేపీ నడ్డాతో భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. తన పర్యటనలో భాంగంగా ఇవాళ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో (JP Nadda) భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. యూరియా సరఫరా పెంచాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, రాష్ట్రానికి సరిపడే యూరియాను కేటాయించాలని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అరకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని, అందువల్ల యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని కోరారు.

Next Story