సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్

by Disha Web Desk 2 |
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దళిత బంధులో చేతివాటం చూపిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ నేతలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. దళిత బంధు లబ్ధిదారుల నుంచి కొంత మంది లంచాలు తీసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వరంగల్ లో ఓ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ లో మరికొంత మంది నేతలు డబ్బులు తీసుకున్న వ్యవహారంపై తన దగ్గర సమాచారం ఉందని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ సొంత పార్టీ నేతల లంచావతారంపై మండిపడ్డారు. నేతలు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని ఇదే రిపీట్ అయితే సహించేది లేదని హెచ్చరించారు.

Read more:

కవితకు ఈడీ నోటీసులపై మొదటిసారి స్పందించిన కేసీఆర్


Next Story

Most Viewed