బిగ్ బ్రేకింగ్: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ప్రగతి భవన్‌లోనే వైద్యం అందిస్తోన్న డాక్టర్స్

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ప్రగతి భవన్‌లోనే వైద్యం అందిస్తోన్న డాక్టర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ సిక్ అయ్యారు. గతవారం రోజులుగా వైరల్ ఫివర్, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రగతిభవన్‌లోనే సీఎంకు యశోదా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఫీవర్ తగ్గేవరకు అక్కడే వైద్యులు ఉండనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సీఎం ఆరోగ్యంపై వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆందోళన పడాల్సిన అవసరం ఏమీలేదని తెలిపారు.

Next Story