నేడు జార్ఖండ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
నేడు జార్ఖండ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర జార్ఖండ్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హోటల్‌లో బస చేస్తోన్న ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా ఇవాళ జార్ఖండ్‌కు వెళ్లనున్నారు.

రేపు జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలోని ఓ రిసార్టుకు తరలించగా వీరంతా 5వ తేదీ ఉదయం రాంచీకి వెళ్లనున్నారు. ఈ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ పటిష్ఠ భద్రత కల్పించింది. దీంతో ఇవాళ్టి రేవంత్ రెడ్డి జార్ఖండ్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకున్నది.



Next Story

Most Viewed