Bus accident: ఆర్టీసీ బస్సు బోల్తా.. నలుగురికి సీరియస్

by Gantepaka Srikanth |

యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా చౌటుప్పల్(Choutuppal) మండలం దండుమల్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Bus accident: ఆర్టీసీ బస్సు బోల్తా.. నలుగురికి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా చౌటుప్పల్(Choutuppal) మండలం దండుమల్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై సోమమారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు(RTC bus) బోల్తా పడింది. డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తుండగా బోల్తా పడినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story