ఆ రోజులకు కాంగ్రెస్ తిరిగి తీసుకొచ్చింది.. BRS ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 2 |
ఆ రోజులకు కాంగ్రెస్ తిరిగి తీసుకొచ్చింది.. BRS ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో పాము కాటుకు రైతు బలైన విషయం తెలిసిందే. మద్దిరాల మండలం చిననెమిలకు చెందిన రావుల లింగయ్య (56) తనకున్న రెండెకరాల్లో వరి వేశాడు. రాత్రి 11.30 గంటలకు పొలానికి వెళ్లిన లింగయ్య పాముకు కాటుకు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన మరణానికి అర్ధరాత్రి కరెంటు ఇవ్వడమే కారణమని, లింగయ్య మృతికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

తాజాగా.. దీనిపై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్ పెట్టింది. ‘అర్ధరాత్రి రైతులు పొలాల దగ్గర పడుకునే పరిస్థిని. విద్యుత్ షాక్‌తో, పాటు కాటులతో రైతులు చనిపోయే రోజులు మళ్లీ వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యం - రైతుల పాలిట శాపం’ అని ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎనాడూ రైతులను, నిరుద్యోగులను, విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదని కొందరు.. మళ్లీ కేసీఆరే రావాలని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.


Next Story

Most Viewed