బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆపాలి.. మంత్రి పొన్నం సీరియస్ వార్నింగ్

by Pooja |

బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నిరసనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు డ్రామాలు ఆపాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు

బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆపాలి.. మంత్రి పొన్నం సీరియస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నిరసనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు డ్రామాలు ఆపాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను చెడగొట్టొద్దని మంత్రి పొన్నం మండిపడ్డారు. నేడు అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా అయనకు అందరం నివాళులు అర్పించాలి కానీ రాజకీయలు చేయవద్దన్నారు. అంబేద్కర్ పెద్ద విగ్రహం దగ్గర నిరసనలు ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రాజ్యంగాన్ని గౌరవిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉండి తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో నిరసనలు వంటి కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.

Next Story