BREAKING: దేశంలో రామరాజ్య పాలన కొనసాగాలి.. లోక్‌సభ ఎన్నికలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Disha Web Desk 1 |
BREAKING: దేశంలో రామరాజ్య పాలన కొనసాగాలి.. లోక్‌సభ ఎన్నికలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రామ రాజ్య పరిపాలన కొనసాగాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇవాళ కరీంనగర్‌ పట్టణంలోని మహాశక్తి ఆలయాన్ని ఆయన సందర్శించారు. మరికొద్దిసేపట్లోనే సిద్దిపేట జిల్లా కొహెడకు ఆయన బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీనే ఉండాలంటూ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఆయన పాలనపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కాకుండా బీజేపీ సొంతంగా 370 సీట్లను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. విపక్షాలు అన్ని సింగిల్ డిజిట్‌కు పరిమితం అయ్యే పరిస్థితి వస్తుందని అన్నారు.


Next Story