- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారీ అగ్ని ప్రమాదం… రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం
దిశ,సత్తుపల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో గాయం కృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన పూరిల్లుకు ప్రమాదవశాత్తు మంటల అంటుకుని పూరి ఇల్లు దగ్ధం అయింది. భారీగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న జగన్నాథం అనే వ్యక్తికి చెందిన తాటాకుల ఇంటికి అంటుకుని ఇళ్ల పూర్తిగా దగ్ధం అయింది. మరోవైపు రెండు ఇళ్లకు అంటుకున్న మంటలు సమీపంలోని రెండు వరి గడ్డి వాములు అంటుకోవడంతో గడ్డివాములు పూర్తిగా దగ్ధం అయ్యాయి. రెండు ఇండ్లల్లో కట్టు బట్టలతో సహా నగదు, బంగారం, పల్సర్ బైక్ కాలి బూడిదయ్యాయి. జగన్నాథం ఇంటిలో గృహోపకరణాలు, నగదు అగ్నికి ఆహుతి అయ్యాయి. రెండు ఇళ్లకు అంటుకున్న మంటలు భారీగా వ్యాపించి ప్రమాదకరంగా మరింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది, దీనితో 10. లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.