కొత్తూరులో రూ.34 లక్షలు పట్టివేత

by Disha Web Desk 23 |
కొత్తూరులో రూ.34 లక్షలు పట్టివేత
X

దిశ, షాద్ నగర్ : కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కట్టెల మిషిన్ షాద్ నగర్ వెళ్లే పాత జాతీయ రహదారిపై కొత్తూరు పోలీసులు ఎస్ ఎఫ్ టి టీం ఆధ్వర్యంలో రూ.34 లక్షలు పట్టుకున్నారు.కొత్తూరు ఎస్సై జి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం కొత్తూరు నుండి షాద్ నగర్ వైపు వెళ్తున్న సిఎంఎస్ ( బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకెళ్లే)వాహనం పై అనుమానం రావడంతో ఆపి తనిఖీ చేశారు.అందులో రూ.34 లక్షల రూపాయలు దొరికాయి.కొత్తూరు నుండి వికారాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిసింది.నగదు తరలించే వాహన నెంబర్ మరియు బ్యాంకు వారు చూపిన రసీదు నందున వాహన నెంబర్లు వేరువేరు ఉన్నందున అనుమానం కలగడంతో ఆ నగదు కు సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో రూ.34 లక్షలను డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీకి పంపడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed