- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ కిరికిరి వల్లే బీసీ రిజర్వేషన్లకు బ్రేక్.. మంత్రి కొండా సురేఖ ఆరోపణలు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీసీ జేఏసీ చేపట్టిన బంద్కు అన్ని రాజకీయ పార్టీతో పాటు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీసీ జేఏసీ చేపట్టిన బంద్కు అన్ని రాజకీయ పార్టీతో పాటు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది. తాజాగా మంత్రి కొండా సురేఖ (Kona Surekha) కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ (Sri Ganesh)తో కలిసి రేత్ఫైల్ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజీపీ కిరికిరి వల్లే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు ఆగిపోయిందని అన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో పని చేశారని పేర్కొన్నారు. చట్ట సభల్లో బిల్లు పెట్టి అమోదించామని, ఆర్డనెన్స్ జారీ చేశామని తెలిపారు. కానీ, గవర్నర్ ఒక్క సంతకం పెట్టి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు. కానీ, బిల్లును ఆపాలనే కుట్రతోనే కేంద్రానికి పంపారని కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన జీవోకు అడ్డుపడ్డారని ఆరోపించారు. మళ్లీ బీసీ బంద్లో బీజేపీ పాల్గొని డ్రామలు ఆడుతోందని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు.
Read More..
పదే పదే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి: కవిత






