కేసీఆర్‌ను రెస్ట్ తీసుకోనివ్వండి.. బూర నర్సయ్య గౌడ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కేసీఆర్‌ను రెస్ట్ తీసుకోనివ్వండి.. బూర నర్సయ్య గౌడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై మాజీ ఎంపీ, బీజేపీ కీలక నేత బూర నర్సయ్య గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా రైతుబంధు ఇవ్వలేకపోయారని.. అయినా ప్రస్తుతం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం మాని విపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని అసహనం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హామీలు అమలు కావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఎండమావిలాంటివని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ నాశనం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. అలాంటప్పుడు ఆ పార్టీకి ఓటేసి ఉపయోగం లేదని అన్నారు. ఇక కేసీఆర్‌ను రెస్ట్ తీసుకోనివ్వండి అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed