ఇలా చేయడానికి సిగ్గుందా కేసీఆర్: సీఎంపై విజయశాంతి తీవ్ర విమర్శలు

by Disha Web Desk 19 |
ఇలా చేయడానికి సిగ్గుందా కేసీఆర్: సీఎంపై విజయశాంతి తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మందు మీద ఉన్న దృష్టి ఆడబిడ్డలకు న్యాయం చేసే విషయంపై లేదని, ఓటేసిన పాపానికి మహిళలకు మరణశిక్ష వేస్తున్నాడని బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం నాంపల్లి స్టేట్ ఆఫీస్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఒక్క రోజు దీక్షలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించని కేసీఆర్.. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆప్ నేత సిసోడియా కోసం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్‌లో ఉందని ఆమెను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే కేసీఆర్ సిసోడియాకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. మద్యం, డ్రగ్స్ అమ్మకాలను సీఎం ప్రోత్సహిస్తున్నారని ఇంత నీచంగా వ్యవహరిచేందుకు నీకు సిగ్గుందా కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. ఎస్టీ బిడ్డ ప్రీతికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ దీక్షలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి, అరవింద్ మీనన్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహిళ నాయకురాళ్లు, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Next Story