హైదరాబాద్‌లో దారుణం.. 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చిన మహిళ

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌లో దారుణం.. 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల బాలుడ్ని మహిళ నరబలి ఇవ్వడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బలైన బాలుడు అబ్దుల్ వహీద్‌గా గుర్తించారు. అమావాస్య వేళ ఆ మహిళ బలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు సదరు మహిళ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Next Story

Most Viewed