వైద్యశాఖ అలర్ట్.. వైరస్‌ హైదరాబాద్ దాటకుండా పక్కా ప్లాన్..!

by Disha Web Desk |
వైద్యశాఖ అలర్ట్.. వైరస్‌ హైదరాబాద్ దాటకుండా పక్కా ప్లాన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : విదేశాల నుంచి వచ్చే వైరస్​వ్యాప్తిని ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధి​దాటకుండా కట్టడి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. జిల్లాల్లోని గ్రామాలకు అంటకుండా అడ్డుకట్ట వేయాలని ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. ఎయిర్​ఫోర్ట్‌లో స్క్రీనింగ్‌తో పాటు టెస్టింగ్​ప్రాసెస్‌ను షురూ చేసింది. లక్షణాలు ఉన్నోళ్లకు ఆర్టీపీసీఆర్​విధానంలో టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్​తేలితే క్వారంటైన్​తప్పనిసరి చేస్తున్నారు. నెగెటివ్​తేలి ఇళ్లకు వెళ్లినోళ్లపై వారం రోజుల పాటు స్థానిక హెల్త్​స్టాఫ్​మానిటరింగ్ చేసే విధానాన్ని పునరావృతం చేయనున్నారు. మరోవైపు ఓవరల్‌గా వస్తున్న పేషెంట్ల నుంచి 2 శాతం శాంపిళ్లను ర్యాండమ్‌గా సేకరించి వేరియంట్లను నిర్ధారించే జీనోమ్​సీక్వెన్సింగ్ టెస్టులకు పంపుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా ఈ ప్రాసెస్​సహజంగానే కొనసాగుతున్నప్పటికీ, ఇతర దేశాల్లో కరోనా అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో ఎయిర్​పోర్టు హెల్త్ ఆథారిటీ మరింత ఫోకస్​పెట్టింది. ఇప్పటి వరకు జీనోమ్​సీక్వెన్సింగ్​నిర్వహించిన శాంపిళ్లలో స్ట్రాంగ్​వేరియంట్లుగా ప్రచారం పొందిన డెల్టా, దాని సబ్​వేరియంట్లు ఏవీ నిర్ధారణ కాలేదని ఎయిర్​పోర్టు హెల్త్​ ఆఫీసర్లు తెలిపారు.

లక్షణాలు ఉన్నాయా...?

విదేశాల నుంచి గడిచిన పదిహేను రోజుల నుంచి ఎవరైనా వచ్చారా? దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయా? అని క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్​ఎంలు సర్వే చేయనున్నారు. లక్షణాలు ఉన్నోళ్లకు మందులు పంపిణీ చేయనున్నారు. తొలి విడత గ్రేటర్​హైదరాబాద్​జిల్లాల్లో ఎయిర్​పోర్టు అథారిటీ ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఓ వైద్యాధికారి తెలిపారు. ఈ సెలబ్రేషన్స్​,ఫెస్టివల్స్​ తర్వాత పరిస్థితిని బట్టి అన్ని ప్రాంతాల్లో నిర్వహించే అవకాశం ఉన్నదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గతంలో క్రమంగా.....

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి మన స్టేట్‌లోకి కరోనా ఎంట్రీ అయింది. గడిచిన మూడు వేవ్‌లలోనూ తొలుత గ్రేటర్​హైదరాబాద్‌లోనే వైరస్​వ్యాప్తి జరిగింది. ఆ తర్వాత పండుగలు, సెలబ్రేషన్స్​ వంటి కార్యక్రమాలతో జిల్లాలకు ప్రజల రాకపోకలు పెరిగాయి. దీంతో జిల్లాల్లోనూ వైరస్ క్రమంగా వ్యాప్తి చెందింది. దీంతో ఈ సారి అలాంటి సిచ్వేషన్​రాకుండా వైరస్​వ్యాప్తి జరిగితే ఇక్కడే కట్టడి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపకల్పన చేస్తోన్నది.

Also Read...

మల్లారెడ్డికి చెక్? ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక గులాబీ బాస్

Next Story