Amanagal: సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన రైతులు

by Ramesh Goud |
Amanagal: సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన రైతులు
X

దిశ, వెబ్ డెస్క్: రైతు రుణమాఫీ(Farmer Loan Waiver)పై హర్షం వ్యక్తం చేసిన రైతులు(Farmers).. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఫాలాభిషేకం చేశారు. తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసింది. దీనిపై మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఆమనగల్(Amanagal) గ్రామంలోని రైతులు తమకు రుణమాఫీ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గ్రామస్థులు స్వీట్లు(Sweets) పంచుకొని సీఎంకు కృతజ్ఞతలు(Thanks) తెలియచేశారు. దీనిపై వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్(BRS) పదేళ్లలో చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లి, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల మాటలకు ప్రజలు మోసపోవద్దని ఆమనగల్ గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed