- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Reservations: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి.. గవర్నర్ను కలిసిన అఖిలపక్ష నేతలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అఖిలపక్ష నేతలు కలిశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill)ను ఆమోదించాలని (Governor Jishnu Dev Verma) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అఖిలపక్ష నేతలు కలిశారు. సోమవారం రాజ్భవన్కు వెళ్లిన అఖిలపక్ష నేతలు గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్, సీపీఐ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారు.
పంచాయతీ రాజ్ చట్టం -2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరారు. తెలంగాణలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ఆగస్టు 31 న శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, ఈ మేరకు మూడ్ ఆఫ్ హౌజ్ను పరిగణనలోకి తీసుకోవాలని అఖిల పక్ష నేతలు కోరారు. ఈ సందర్భంగా బీసీ జనాభా వివరాలు గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.
సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. 50 శాతం రిజర్వేషన్లు సీలింగ్ ఎత్తివేస్తూ చట్ట సవరణ చేశామని తెలిపారు. కుల గణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కోసం చట్టం తెచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణలో 56.33 శాతం బీసీల జనాభా ఉందన్నారు. బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పట్టుబడుతున్నాయి. కుల గణన సర్వే నివేదిక దృష్టిలో పెట్టుకొని అఖిలపక్షం గవర్నర్ ను కలిసి ఆమోదించాలని కోరినట్లు స్పష్టం చేశారు.






