ALERT : అడ్మిషన్స్ నోటిఫికేషన్‌పై బాసర ట్రిపుల్ ఐటీ కీలక ప్రకటన

by Disha Web Desk 4 |
ALERT : అడ్మిషన్స్ నోటిఫికేషన్‌పై బాసర ట్రిపుల్ ఐటీ కీలక ప్రకటన
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ప్రతిష్టాత్మక విద్యాసంస్థ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బాసర ట్రిపుల్ ఐటి అడ్మిషన్లకు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ వివరాలు వెల్లడించారు. జూన్ 1న నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు. ఐదో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం అవుతాయన్నారు. 19వ తేదీలోపు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రత్యేక కేటగిరీకి చెందిన వికలాంగులు స్పోర్ట్స్ కోట ఎన్‌సీ‌సీ అభ్యర్థులు పోస్టల్‌లో దరఖాస్తు చేసుకునేందుకు 24వ తేదీ వరకు గడువు ఇస్తున్నారు. ఈ నెల 26న తుది జాబితాను ప్రకటించి ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్ట్ వెలువరించనున్నారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ట్రిపుల్ ఐటీ‌లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed