బాసర గోదారిలో ఐదుగురు యువకులు మృతి..

by Bhanu |

నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి దర్శనానికి వచ్చి, గోదావరి నదిలో పుణ్యస్నానలు ఆచరిస్తుండగా ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చోటుచేసుకుంది.

బాసర గోదారిలో ఐదుగురు యువకులు మృతి..
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి దర్శనానికి వచ్చి, గోదావరి నదిలో పుణ్యస్నానలు ఆచరిస్తుండగా ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఏఎస్పీ అవినాష్ తెలిపిన వివరాల ప్రకారం...మృతిచెందిన యువకులంతా తెలంగాణ రాష్ట్రo హైదరాబాద్ దిల్సుఖ్ నగర్,చింతల్ ప్రాంతం నికి చెందినవారని పేర్కొన్నారు.

దాదాపు 25 మంది సన్నిహిత కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం బాసర అమ్మవారి దర్శనానికి రాగా... పుణ్యస్నానం ఆచరిoచ డానికి ఈ ఐదుగురు యువకులు రాకేష్(20),వినోద్(19), రూతిక్(22),మదన్(18),భరత్(16) బోట్ పై వెళ్లి ఇసుక మేట వేసిన ప్రాంతంలో ఆగి అక్కడి ప్రాంతంలో వున్న నీటిలో స్నానం చేయడానికి దిగి గుంతలలో చిక్కుకొని అక్కడికక్కడే మరణించారు.

అయితే చింతల్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ముగ్గురు రాకేష్,మదన్,భరత్ కాగా ఆ కుటుంబానికి సంబంధించిన సమీప బంధువు వినోద్ ...అలాగే దిల్సుఖ్నగర్ ఏరియా కి చెందిన రూతీక్ అనే యువకులు మరణించారు.రాకేష్,మదన్, భరత్ ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి ఇలా ప్రమాదవశాత్తు మరణించడంతో తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది.


Next Story