ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలి..

by Disha Web Desk 20 |
ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలి..
X

దిశ, భీమిని : భీమిని మండలంలోని మల్లిడి గ్రామంలో సోమవారం మండల పరిషత్ పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయంలో ఉపాధ్యాయులు పాఠశాలకు సమయపాలన పాటించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో ప్రతిరోజు ప్రార్ధన చేయించడం లేదని ఈ విషయంపై జిల్లావిద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడికి ఫోన్ చేసి నిరంతరం తనిఖీలు చేసి ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్వాడి కార్యకర్తలు సమయపాలన పాటించకపోవడం పై సీడీపీఓకు ఫోన్ లో సమాచారం అందించారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణ పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అంగన్వాడి కేంద్రాల్లో టీచర్లు సమయపాలన పాటించడం లేదని మండిపడ్డారు. ఎంపీపీ వెంట గ్రామసర్పంచ్ బలగం సంతోష్ గ్రామస్తులు ఉన్నారు.


Next Story

Most Viewed