ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2023-04-05 15:35:09  IST  )

ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని చించోలియం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం
X

దిశ, సారంగాపూర్: ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని చించోలియం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లేష్ (40) మద్యానికి బానిసై ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్లేష్ అతని కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం బజరహాత్నూర్ లోని తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. అనంతరం కుటుంబ సభ్యులు అక్కడే ఉండగాతో అదే రోజు సాయంత్రం మల్లేష్ తనస స్వగ్రామానికి తిరిగొచ్చాడు. కుటుంబ సభ్యులు ఎంత ఫోన్ చేసినా మల్లేష్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, వారు పక్కింటి వాళ్లకు కాల్ చేయగా వారు వెళ్లి ఇంట్లో చూసేసరికి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు.

Next Story