మతాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలి..

by Disha Web Desk 20 |
మతాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలి..
X

దిశ, మంచిర్యాల టౌన్ : మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న రంజాన్ మాసంతో పాటు ఈ నెల చివరిలో వస్తున్న శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండుగలను జిల్లావాసులు మతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కోరారు. గురువారం మంచిర్యాలలోని స్థానిక డీసీపీ కార్యాలయం జిల్లాకు సంబంధించిన ముస్లిం, హిందూ మత పెద్ధలతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ పోలీస్ వారికి సహకరించాలని, జిల్లా పరిధిలో ప్రతిఒక్కరు సోదర భావం కలిగివుండి శాంతియుత వాతారణంలో పండుగలు జరుపుకోవాలని, మీడియాలో వచ్చే వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసత్య వార్తలను నమ్మి ప్రచారం చెయ్యవద్దని కోరారు.

ఏ సమస్య వచ్చినా స్పష్టంగా మత పెద్దలు, పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీసుశాఖ పరంగా చేపట్టాల్సిన విధులు నిర్వర్తించడంతో పాటు పోలీసుశాఖకు సహకరించాలని డీసీపీ అన్నారు. ఈ సంధర్భంగా స్థానికంగా ఉండే సమస్యలను అడిగి తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారమార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ రాజు, మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, మత పెద్దలు ఎస్సైలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed