తామర పూవుతో మొదలైన ఉదయం… శవంగా ముగిసిన సాయంత్రం!

by Bhanu |

నిర్మల్ జిల్లా బాసరలో పువ్వుల కోసం చెరువులోకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతి చెందాడు.

తామర పూవుతో మొదలైన ఉదయం… శవంగా ముగిసిన సాయంత్రం!
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బాసరలో పువ్వుల కోసం చెరువులోకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతి చెందాడు. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..బాసరకు చెందిన బలగం రాజు (38) మైలాపూర్ చెరువులో తామర, కమలం పువ్వులు తేయడానికి వెళ్లగా అపస్మారకంగా నీటిలోకి జారిపడ్డాడు.


ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, మృతుడి భార్య సైతం అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం.




Next Story