- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తామర పూవుతో మొదలైన ఉదయం… శవంగా ముగిసిన సాయంత్రం!
by Bhanu |
నిర్మల్ జిల్లా బాసరలో పువ్వుల కోసం చెరువులోకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతి చెందాడు.

X
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బాసరలో పువ్వుల కోసం చెరువులోకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతి చెందాడు. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..బాసరకు చెందిన బలగం రాజు (38) మైలాపూర్ చెరువులో తామర, కమలం పువ్వులు తేయడానికి వెళ్లగా అపస్మారకంగా నీటిలోకి జారిపడ్డాడు.
ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, మృతుడి భార్య సైతం అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం.
Next Story






