గత ఎనిమిది సంవత్సరాలుగా జిల్లా టాప్ ఆ పాఠశాల విద్యార్థులు..

by Disha Web Desk 20 |
గత ఎనిమిది సంవత్సరాలుగా జిల్లా టాప్ ఆ పాఠశాల విద్యార్థులు..
X

దిశ, జన్నారం : ప్రతి సంవత్సరం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ (స్కాలర్షిప్) పరీక్షా ఫలితాల్లో జెడ్పీఎస్ఎస్ కిష్టాపూర్ విద్యార్థులు గత 8 సంవత్సరాల నుండి జిల్లాలో మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా 15 మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి మురళి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత శుక్రవారం వెలువడిన ఎన్ఎంఎంఎస్ ఫలితాల షార్ట్ లిస్ట్ లో పాఠశాల నుండి 15 మంది విద్యార్థులు ఎంపిక అయి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపారు.

పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టికృషియే ఈ విజయాలకు కారణమని, ప్రతి ఉపాధ్యాయుని కృషి వల్లనే ఈ విజయం సాధించామని అన్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల నుండి 231 స్కాలర్షిప్ లు పొందిన ఏకైక పాఠశాల అని రాష్ట్రంలో కిష్టాపూర్ పాఠశాల నిలువడం గర్వంగా ఉందని అన్నారు. ఎన్ఎంఎంఎస్ (2022-23) ఫలితాలలో కిష్టాపూర్ విద్యార్థులు 15 మంది ఎంపికతో మంచిర్యాల జిల్లాలో అత్యధిక స్కాలర్షిప్ లను సాధించి మరోసారి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ సెకండ్ పాఠశాల విద్యార్థులు 231 స్కాలర్షిప్ లను సాధించటం విశేషం.

Next Story

Most Viewed