తన కొడుకులను గోదావరిలోకి తోసిన తండ్రి.. చివరకు ఏం జరిగిదంటే ?

by Dishanational2 |
తన కొడుకులను గోదావరిలోకి తోసిన తండ్రి.. చివరకు ఏం జరిగిదంటే ?
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది‌లో ఆర్ధిక కారణాలతో, మనస్తాపం చెందిన ఓ వ్యక్తి మొదట ఇద్దరు కుమారులను తోసి, ఆ తరువాత తాను ఆత్మహత్యకు యత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జీవితంలో ఆర్థిక కారణాలుతో ఇబ్బందిపడి, మనస్తాపం చెంది నిజామాబాద్‌కు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి సోమవారం బాసర గోదావరిలో మొదట తన ఇద్దరు కుమారులు అక్షయ్,రివాన్ష్ తోసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకోవాలనుకొగా, ఇది గమనించిన అక్కడే ఉన్న గంగ పుత్రులు వెంటనే వారిని కాపాడి, స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ముగ్గురు క్షేమంగా ఉన్నరు. పిల్లల్ని, తండ్రిని కాపాడిన యంచ గ్రామానికి చెందిన గంగపుత్రులను పలువురు ప్రశంసిస్తున్నారు. ఎంత బాధ, ఆర్ధిక ఇబ్బందులతో వున్నా ఓర్పుతో సమస్యలను తీర్చుకోవాలి గాని, సమస్యలకు పిల్లల్నిబలి చేయడం సరికాదన్నారు. అలాగే చిన్నపిల్లలను చూస్తు స్థానికులు అయ్యో..! పాపం అంటూ ఆవేదన చెందుతున్నారు. పోలీసులు ప్రవీణ్ భార్యకు సమాచారం అందించారు.



Next Story

Most Viewed