వడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా...

by Bhanu |

నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామంలో గురువారం మధ్యానం మూల మలుపు వద్ద వడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.

వడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా...
X

దిశ,భైంసా : నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామంలో గురువారం మధ్యానం మూల మలుపు వద్ద వడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. కాంట్రాక్టర్ నాసిరకం కల్వర్టులు నిర్మించడంతోటే ఈ ప్రమాదం సంభవించింది అంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...లక్ష్మణ్ చాందా మండలం పార్పల్లి గ్రామం నుండి లోకేశ్వరము మండల కేంద్రానికి వడ్ల లోడుతో వెళుతున్న లారీ దేగాం గ్రామంలో మూలమలుపు వద్ద బోల్తా పడగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలింపు చేశారు. నాణ్యతలేని నిర్మాణాలతోటే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, కాంట్రాక్టర్స్ నిర్మిస్తున్న నిర్మాణాలపై సంబంధిత అధికారులు నిఘా పెంచాలని పలువురు ప్రజలు వాపోతున్నారు.



Next Story