- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు వేదికలో రుణమాఫీ లొల్లి..!
కుబీర్ మండలంలోని పల్సి రైతు వేదికలో రుణమాఫీలొల్లి రాసాభాసగా మారింది.

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని పల్సి రైతు వేదికలో రుణమాఫీలొల్లి రాసాభాసగా మారింది. శనివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం రోజున పల్సిలో జరిగిన రైతువేదిక సమావేశంలో నిరసన నిరాశకు గురయ్యారు. రుణమాఫీ జరుగుతుందని ఒక ప్రజాప్రతినిధిమాట్లాడగా ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎన్ని రోజులు వేచిచూడాలి, అంటు పలువురు ప్రజాప్రతినిధులు నిలదీసే ప్రయత్నం చేశారు.
లక్ష రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేయకపోవడంతో లక్ష రూపాయలు వడ్డీకే సరిపోయిందని పలువురు రైతులు విమర్శిస్తూ కనిపించారు. దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పుకుంటూ వస్తున్న ఆచరణలో విఫలమయ్యారని అన్నారు. రైతులు ప్రజాప్రతినిధులు రైతురుణమాఫీ విషయం పై ఒకేసారి లేవడంతో ఒకసందర్భంలో గందరగోళం నెలకొంది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి మైనస్ లో ఉందని పలువురు చర్చించుకోవడం కనిపించింది. అధికారులు ప్రజాప్రతినిధులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమనిగింది.






