- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పిలుపు నిచ్చారు.

దిశ, ఉట్నూర్ : రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో అంబేద్కర్ మెమొరియల్ అసోసియేషన్ మండల సభ్యులతో కలసి జయంతికి సంబంధించిన వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ సబ్బండ వర్గాల హక్కులకై జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ అని అన్నారు. ఏప్రిల్ 14న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరిగే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున తరలిరావాలన్నారు.
ప్రతి ఒక్కరూ అంబేద్కర్ మార్గాన్ని అనుసరించి, వారు చూపిన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే జితేందర్, గౌరవ అధ్యక్షుడు కాంబ్లే మనోజ్, ప్రధాన కార్యదర్శి కాంబ్లే మారుతి,కోశాధికారి కాంబ్లే ఉత్తం, రత్న సాన్వీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు ఉపారపు సత్యరాజ్, హెల్ప్ వీల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంబ్లే ఆతీశ్, భీం ఆర్మీ మండల అధ్యక్షుడు సూర్యవంశీ ఉత్తం,అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు వాగ్మారే శుద్ధోదన్, గిల్చే నారాయణ, గాయక్వాడ్ రజనీకాంత్ పాల్గొన్నారు.






