బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

by Disha Web Desk 1 |
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
X

దిశ, లక్షెట్టిపేట: బైక్ అదుపుతప్పి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ యువకుడి మృతిచెందిన ఘటన శనివారం సాయంత్రం మండల పరిధిలోని వెంకట్రావుపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బూసరాజుల రాజేందర్ (25) శుక్రవారం బైక్ పై చింతపల్లిలోని ఓ ఫంక్షన్ కు హాజరై స్వగ్రామైమానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

ఈ క్రమంలో బైక్ ఎల్లారం గ్రామంలోని రైస్ మిల్లు వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో రాజేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలసుకున్న కుటుంబ సభ్యులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించారు. రాజేందర్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed