వివాహేతర సంబంధం.. చితకబాదడంతో ఓ వ్యక్తి..

by Disha Web Desk 4 |
వివాహేతర సంబంధం.. చితకబాదడంతో ఓ వ్యక్తి..
X

దిశ, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేని పల్లి గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురికాగా.. మరో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే మాచినేని పల్లి గ్రామానికి చెందిన మూరకొండ రాముడు (45) అనే వ్యక్తి , అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మహిళతో కలిసి రాములు ఊరు బయట ఏకాంతంగా గడుపుతున్న విషయం తెలుసుకొని.. ఆ మహిళ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రాములును చితకబాదినట్లు సమాచారం.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాములును హుటాహుటిన నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మరణించాడు. రాముడు మరణించాడు అన్న విషయం తెలుసుకున్న ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. డీఎస్పీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు హత్యకు గల కారణాలు, హత్యకు పాల్పడిన వారి వివరాలను సేకరిస్తున్నారు.

Next Story

Most Viewed