- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కియ కార్ల పరిశ్రమలో చోరీ..900 ఇంజిన్లు మాయం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( AP ) భారీ దొంగతనం జరిగింది. ఏకంగా కార్ల కంపెనీ కియాకు ( Kia ) ఎసరు పెట్టారు దొంగలు ( Thieves). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కియా కార్ల కంపెనీలో ఏకంగా 900 ఇంజిన్లు (Engines ) దొంగతనం చేశారు దుండగులు. ఇప్పుడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో.. ఏకంగా 900 ఇంజిన్లను.. అర్థరాత్రి దొంగిలించారు. వాస్తవంగా ఈ సంఘటన మార్చి నెలలో జరిగింది. కానీ ఈ విషయాన్ని దాచినట్లు తెలుస్తోంది. కానీ తాజాగా ఈ దొంగతనం సంఘటన పైన అసలు విషయాలు బయటకు వచ్చాయి.
ఈ సంఘటన జరిగిన వెంటనే... కియా ( Kia ) యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ విషయం బయటకు రాకుండా, ఎలాంటి ఫిర్యాదు లేకుండానే దర్యాప్తు చేయాలని ఏపీ పోలీసులను కియా యాజమాన్యం కోరిందని చెబుతున్నారు. కానీ పోలీసులు ఈ విషయంలో నిరాకరించారు. ఈ తరుణంలోనే మార్చి నెల 19వ తేదీన... ఈ దొంగతనం పైన ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ దొంగతనం పై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది.
తమిళనాడు రాష్ట్రం నుంచి.. ఏపీలోని కియా పరిశ్రమకు ఇంజిన్లు నిత్యం తీసుకువస్తారని సమాచారం అందుతుంది. అయితే గత నెలలో కూడా అచ్చం అలాగే ఇంజిన్లు తమిళనాడు నుంచి ఏపీకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దారిలోనే మాయం చేశారా..? కంపెనీకి వచ్చిన తర్వాత దొంగిలించారా ? అనే కోణంలో పోలీసుల బృందం. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.