పని కోసం వెళ్లి.. పరాయి దేశాల్లో మృతి

by  |
పని కోసం వెళ్లి.. పరాయి దేశాల్లో మృతి
X

దిశ, నిజామాబాద్ రూరల్: సొంత ఊర్లో పని లేక, బతుకుదెరువు కోసం ఎడారి దేశం బాటపట్టాడు ఓ వ్యక్తి. అయితే గత రెండు నెలలుగా కిడ్నీవ్యాధితో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సిరికొండ మండలం కొండాపూర్‌కు చెందిన కమ్మరి రాములు (47) ఆరేళ్ల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ బాట్టాడు. ఆయన సౌదీ అరేబియాలోని అలానా ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే తన రెండు కిడ్నీలు చెడిపోవడంతో శనివారం మృతి చెందినట్లు అతని కుటుంబీకులు తెలిపారు. ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన మాలవత్ పాండ్య (32) శనివారం ఒమన్ దేశంలో మృతి చెందాడు. మూడేళ్ల క్రితం పని కోసం ఒమన్ వెళ్లిన పాండ్య, శనివారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.


Next Story

Most Viewed