బ్లాక్‌ ఫంగస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

by  |
black fungus
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఓవైపు కరోనా మహమ్మారి మరోవైపు బ్లాక్ ఫంగస్ వైరస్‌లు విజృంభిస్తు్న్నాయి. కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తితో ఇప్పటికే రాష్ట్రం అతలాకుతలం కాగా, మరోవైపు బ్లాక్ ఫంగస్ ముంచుకొస్తుంంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్‌ని నోటిఫైబుల్ వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనా తప్పక ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు అన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రతి రోజూ ఆయా ఆస్పత్రుల్లో నమోదైన, బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివారాలు ఆరోగ్య శాఖకు అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story

Most Viewed