- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కొత్త వేరియంట్(ఒమిక్రాన్) పై అప్రమత్తమైన కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగించాలని మోడీ సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ఇక కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్.. కరోనా రెండు డోసులు వేసుకున్నవారికే అనుమతిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రేపు వైద్యారోగ్య శాఖ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోన్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.