అదే తీరు..చూపని జోరు !

by  |
అదే తీరు..చూపని జోరు !
X

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. స్వల్ప వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయి..ఎట్టకేలకు 242 పరుగులు చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును కివీస్ బౌలర్లు జేమిసన్ (5), బౌల్ట్ (2), సౌథీ (2) వికెట్లతో కుప్పకూల్చారు. ఓపెనర్ పృథ్విషా (54), పుజారా (54) , విహారి (55) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇక కెప్టెన్ కోహ్లీ తన వైఫల్యాన్ని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. గత మ్యాచ్‌లో రాణించిన రహానే కూడా కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరడంతో భారత జట్టు కేవలం 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పృథ్వి షా హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడమొక్కటే ఈ ఇన్నింగ్స్‌లో సానుకూలాంశం.

ఆ తరువాత ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ భారత బౌలర్లను ఉతికారేశారు. భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ నిలకడగా ఆడారు. ఈ క్రమంలో ఓపెనర్ టామ్ లేథమ్ (27), బ్లండెల్ (29) పరుగులు చేశారు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 23 ఓవర్లలో 63 పరుగులు చేసి భారత్‌పై పైచేయి సాధించింది.



Next Story

Most Viewed