రాష్ట్రం ఏమై పోతుందో అర్థం కావడం లేదు: పట్టాభి

by  |
రాష్ట్రం ఏమై పోతుందో అర్థం కావడం లేదు: పట్టాభి
X

దిశ, వెబ్ డెస్క్: జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో విషాద ఘటనలు ఆగడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. రాష్ఠ్రానికి అరిష్టం వచ్చినట్టయిందని, రాష్ట్రం ఏమైపోతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య మంత్రి నియోజక వర్గంలోనే ప్రజలకు ఆరోగ్యం లేదని విమర్శించారు. కలుషిత నీటితోనే ఆరోగ్య సమస్యలు వచ్చినట్టు తెలుస్తోందన్నారు. ఏలూరు ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించలేదని పేర్కొన్నారు. తక్షణమే సీఎం జగన్ ఏలూరుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని లోకేశ్ ప్రశ్నించే వరకు స్పందించలేదని చెప్పారు.

Next Story

Most Viewed