- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం, మంత్రులు ఇళ్లు కదలరు.. కానీ ప్రజలు రోడ్డున పడాలా ?
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆధార్ అప్డేషన్ పేరుతో పేదల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ ప్రజల భద్రతను గాలికొదిలి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. ఈ-కేవైసీ ప్రజల సంక్షేమం కోసమా? వేధించడం కోసమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇళ్లు కదలరు కానీ పేదలు రోడ్డునపడాలా? అని నిలదీశారు. పేదప్రజలు పనులు మానుకొని ఈ-కేవైసీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆధార్ అప్డేషన్ పేరుతో పేదల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ ప్రజల భద్రతను గాలికొదిలి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. ఈ-కేవైసీ ప్రజల సంక్షేమం కోసమా? వేధించడం కోసమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇళ్లు కదలరు కానీ పేదలు రోడ్డునపడాలా? అని నిలదీశారు. పేదప్రజలు పనులు మానుకొని ఈ-కేవైసీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సంక్షేమ పథకాలను దూరం చేసేందుకే ఈ-కేవైసీ సాకుగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ-కేవైసీని నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని..అప్పటి వరకు షరతులు లేకుండా రేషన్ పంపిణీ చేయాలని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.
Next Story






