పోతిరెడ్డిపాడుకు నీటిని మళ్లించాలి

by  |
somireddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నప్పటికీ పోతిరెడ్డిపాడుకు నీళ్లిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. కృష్ణా, తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతున్నా, పోతిరెడ్డిపాడుకు నీళ్లిచ్చేందుకు సర్కార్ సిద్ధంగా లేకపోవడం దారుణమన్నారు. కేవలం మద్రాసుకు తాగునీటి కోసం తెలుగుగంగకు 9 టీఎంసీలు ఇచ్చి ఆపేయాలని కృష్ణాబోర్డు ఆదేశాలివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.



Next Story

Most Viewed