- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: రామతీర్థం పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే ప్రభుత్వం తల వంచుకోవాలన్నారు. రామతీర్థం పర్యటన చేపట్టడంతో ప్రభుత్వం భయపడి తమపై నిందలు వేస్తోందన్నారు.తనపై కేసు పెడతారా.. ఖబర్దార్ సీఎం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రామతీర్థం ఘటన జరిగి ఐదు రోజులైనా ఎందుకు పట్టించుకోడం లేదని ప్రశ్నించారు.
జగన్ ఒక క్రిస్టియన్.. అతని నమ్మకం అతనిది.. మా నమ్మకం మాది అని చంద్రబాబు అన్నారు. మన దేవాలయాలను మనమే కాపాడుకుందామని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. విజయనగరం ఎస్పీ ఒక మహాతల్లి, ఆమె తమను అడ్డుకుందని తెలిపారు. సీఎం జగన్, హోంమంత్రి, డీజీపీతో పాటు స్థానిక ఎస్పీ క్రిస్టియన్లు అయినంత మాత్రాన.. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆపరా అంటూ ప్రశ్నించారు. మతమార్పిడులు చేయించే అధికారం సీఎంకు ఎవరిచ్చారని నిలదీశారు.