జగన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు : చంద్రబాబు

by  |
TDP
X

దిశ, వెబ్‌డెస్క్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీకారంతో రగిలిపోతున్నాడని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిన్న ఈఎస్‌ఐ కుంభకోణం పేరుతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేయించారని, నేడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని నకిలీ ఇన్యూరెన్సు పత్రాల కేసులో అరెస్టు చేయడం దారుణం అని అభివర్ణించారు.ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు ధోరిణిలో భాగమే తప్పా..మరొటి కాదన్నారు. ప్రభుత్వం కావాలనే టీడీపీ నాయకులను ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.అయినప్పటికీ తాము వెనక్కితగ్గేది లేదని ఆయన స్పష్టంచేశారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఖండించడంతో పాటు, తమ నేతల అరెస్టులకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.

Advertisement
Next Story

Most Viewed