గోవా తీరంలో అర్జున్ కపూర్‌తో తార.. ఇన్‌స్టాలో పోస్ట్!

by  |
Tara Sutaria Arjun Kapoor
X

దిశ, సినిమా : మోహిత్ సూరి డైరెక్షన్‌లో ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించిన ‘ఏక్ విలన్’ మూవీ 2014లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్ర, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. రితేశ్ దేశ్‌ముఖ్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద మూవీ సూపర్ సక్సెస్ కాగా, ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఏక్ విలన్ రిటర్న్స్’ శరవేగంగా షూటింగ్ జరపుకుంటోంది. హాట్ బ్యూటీ దిశా పటానీ, జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియా వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొనగా.. ఈ థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ముంబైలో షురూ కాగా.. దిశా పటానీ, జాన్ అబ్రహంపై పలు సన్నివేశాలు చిత్రీకరించింది మూవీ యూనిట్. తాజాగా తారా సుతారియా, అర్జున్ కపూర్‌పై గోవా షెడ్యూల్‌లో పలు సీన్లను షూట్ చేస్తుండగా.. వీరిద్దరూ ‘డే 1’ షూటింగ్ ప్రారంభమైనట్లు ఇన్‌స్టా వేదికగా పోస్టులు పెట్టారు. కాగా అర్జున్ కపూర్ ఈ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తున్నారని, రితేజ్ దేశ్‌ముఖ్ కంటే బాగా నటిస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం విశేషం.



Next Story

Most Viewed