ఆ ఎస్ఐ లపై చర్యలు తీసుకోండి..

by  |
ఆ ఎస్ఐ లపై చర్యలు తీసుకోండి..
X

దిశ, చండూర్ : చండూరు ఎస్ఐ, గుడిపల్లి ఎస్ఐ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చండూరు వ్యవసాయ కార్యాలయం వద్ద, వ్యవసాయ అధికారులు నల్ల బ్యాడ్జీలతో, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చండూరు వ్యవసాయాధికారి మల్లేశం మాట్లాడుతూ.. అక్టోబర్ 2న మా పై, మా వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు పై, పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. మా పై దాడి జరిగి ఐదు రోజులు కావస్తున్నా, ఇంతవరకు ఎస్ఐలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎస్ఐలను సస్పెండ్ చేయకపోతే, నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పై జరిగిన దాడికి నిరసనగా ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు నిఖిల్, పవన్, నాగార్జున, శోభారాణి, అనూష, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed