- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటుచేసుకుంది. పట్టణ శివారు కట్టకొమ్ముగూడెం రోడ్ లోని గ్రౌండ్లో యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున వాకింగ్ కు వెళ్లిన స్థానికులు గ్రౌండ్ లో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు కోదాడ పట్టణానికి చెందిన మన్నూరి వెంకన్న(30)గా గుర్తించారు.
మృతుడి ముఖంపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి ముఖంపై బలమైన రక్తపు గాయాలు ఉండడంతో మర్డర్ కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వివాహేతర సంబంధమే మృతికి కారణం కావచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రప్పించి, క్లూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉన్నది.